గాజువాక: శ్రీనగర్ సిఎల్సి చర్చి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ
గాజువాక శ్రీనగర్ లో గల సి ఎల్ సి చర్చిలో పేదలకు నిరుపేదలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చర్చి ఫాదర్ సుధీర్ మహంతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కుట్టుమిషన్లు తీసుకుని ఆనందించారు. ఈ సందర్భంగా మహంతి మాట్లాడుతూ కుటుంబంలో భార్య భర్త కలిసి పనిచేసిన పరిస్థితి ఏర్పడిందని దీని అధికమించడానికి స్త్రీలు అందరూ కూడా ఇంట్లో ఈ కుట్టు మిషన్ ఉపయోగించుకుని జీవించవలసిన పరిస్థితి ఉందని తమ సంపాదనలో ఎంతో కొంత సహాయపడుతూ ఉండాలని అలాగే మేము ఇచ్చిన ఈ కుట్టు మిషన్లతో ఎందరో జీతాలు కూడా సంపాదించుకుంటున్నారని ఆయన తెలియజేశారు.