సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ కంగ్టి మండలంలోని సంక్షేమ హాస్టల్ లను సోమవారం రాత్రి నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా విషయక అంశాలపై చర్చించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. ఫుడ్ పాయిజన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.