అనంతపురం నగరంలో కిడ్నాప్ కలకలం రేపింది. శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం బనగానపల్లి మండలం కుర్లపల్లి కి చెందిన కురుబ బాలకొండ శంకరయ్యను కిడ్నాప్ చేసి విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అతనిని మరో చోటికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా నాలుగవ పట్టణ పోలీసులు అతనిని కాపాడారు. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.