నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్ ను నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విజయవాడకి తరలించారు. ఉదయం విజయవాడ పోలీసులు నెల్లూరుకు వచ్చి.. జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాముని ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకెళ్లారు. కేవలం అరగంటసేపు మాత్రమే తొలిరోజు జోగి బ్రదర్స్ ను విచారించారు.. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ సబ్ జైలుకు తరలించారు.. రేపటి నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు రోజులు పాటు వారిద్దరినీ ఎక్సైజ్ పోలీసులు విచారించనున్నారు..