పత్తికొండ: వెల్దుర్తి మండలం లో గంజాయి పట్టివేత
వెల్దుర్తి మండలం మాధాపురం బస్టాప్ వద్ద పోలీసులు గంజాయిని శనివారం పట్టుకున్నారు. గోవర్ధనగిరికి చెందిన ఎరుకల లక్ష్మన్న గంజాయి తీసుకుని వెళ్తుండగా సీఐ యుగంధర్, ఎస్ఐ నరేశ్, ఆర్ఎస్ఐ మంజుల, వ్యవసాయ అధికారి అక్బర్ బాషా సంయుక్తంగా సోదాలు జరిపి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి గంజాయి స్వాధీనం తీసుకొని, కేసు నమోదు చేశారు. అక్రమంగా గంజాయి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.