కడప జిల్లా ప్రొద్దుటూరు వైసిపి కార్యాలయంలో బుధవారం ప్రొద్దుటూరు మునిసిపల్ పరిధి, రాజుపాలెం,ప్రొద్దుటూరు మండలాలకు సంబందించిన నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లతో వైయస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వార్డు మరియు గ్రామ కమిటీల నియామకాలు మరియు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పై రివ్యూ మీటింగ్ నిర్వహించి, ప్రజలకు గత ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి గల తేడాను తమ తమ ప్రాంతాలలో ప్రజలకు వివరించాలన్నారు.