చిత్తూరు: ఇంటి స్థలాలు కేటాయించాలని వినతి చిత్తూరు చెర్లోపల్లిలో 120 కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయించాలని బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇంటి స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు వారు పేర్కొన్నారు. తేనె బండ గ్రామంలో ప్రభుత్వ భూమి ఉందని, ఇందులో కేటాయించాలని గ్రామ కమిటీ తీర్మానం ఆమోదించిందని తెలిపారు. దీనిని పరిశీలించాలని రూరల్ తహశీల్దార్కు కలెక్టర్ సూచించారు.