అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏళేశ్వరం, రాజవొమ్మంగి పరిసరాల్లో రహదారుల గోతులు పూడ్చాలంటూ రాజవొమ్మంగి జడ్పీటీసీ జ్యోతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. డిప్యూటీ సీఎం సీఎం ఈ ప్రాంతంలో రహదారులకు మరమ్మతులు చేపట్టాలని చెప్పిన అధికారులు పట్టించుకోవటం లేదని జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ ప్రాంతంలోని రహదారులకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.