కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని గోపవరం మండలం రాచాయిపేట సమీపంలో శుక్రవారం స్కూల్ బస్సు సండ్రపల్లి చెరువు కట్టపై ఒరిగిన విషయం తెలిసిందే. స్కూల్ బస్సు చెరువు కట్టపై ఒరిగిన స్థలానికి రూరల్ ఎస్సై శ్రీకాంత్, ఆయన సిబ్బంది చేరుకుని పరిశీలించారు. సంఘటన స్థలంలో ఎస్సై శ్రీకాంత్ వివరాలు సేకరించారు.స్కూల్ పిల్లలందరూ క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. జెసిబి సహాయంతో బస్సును బయటకు తీసి, పిల్లలను సురక్షితంగా వారి గ్రామాలకు తరలించామన్నారు.