ప్రకాశం జిల్లా కొండపీ సర్కిల్ సీఐ సోమశేఖర్ మంగళవారం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు. నిబంధనలు పాటిస్తూ వాహనదారులు వాహనాలు నడపడంతో పాటు వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తల రోడ్డుకు తగిలితే జరిగే అనార్థాలను వివరించారు. నిబంధనలు పాటించకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.