చర్లపల్లి పరిధిలో తాగునీటి, మురుగు సమస్యలు తీవ్రంగా ఉండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి, జలమండలి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం డిమార్ట్ మెయిన్ రోడ్డుపై ఖాళీ బిందెలతో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. 30 రోజులవుతోందని, జలమండలి ఏఈ సందీప్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.