కరీంనగర్: చేసుకున్న భర్త, కడుపున పుట్టిన ఒక్కగానొక్క కొడుకు మరణంతో అనాథగా మారి ఎటు వెళ్లలో తెలియక వర్షంలో వృద్ధురాలు
నా అనే వాళ్ళు ఎవరు లేకపోవడంతో అనాథగా మారింది ఓ వృద్ధురాలు. చేసుకున్న భర్త, కడుపున పుట్టిన ఒక్కగానొక్క కొడుకు అకాల మరణం ఆ వృద్ధురాలిని రోడ్డున పడేసింది. ఇదిగో ఈ ముసలావిడను చూడండి. గురువారం సాయంత్రం 5గంటలకు కరీంనగర్లోని సూర్య హాస్పిటల్ ఎదురుగా ఫుట్పాత్పై వర్షంతో తడుస్తు.. ఒక అనాథగా జీవనం వెల్లదీస్తుంది. ఈ తల్లిని చూస్తే మనసు చలించి పోతుంది కదు. స్థానికంగా ఉన్న ఇద్దరు యువకులు ఓ ఆశ్రమ నిర్వాహకులకు సమాచారము ఇవ్వడంతో..కరీంనగర్ జిల్లా వెలిచాలలోని స్పందన ఆశ్రమం అక్కున చేర్చుకుంది. వృద్ధురాలి సమాచారం తెలుసుకున్న ఆశ్రమ నిర్వాహకులు తమ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు.