సంగారెడ్డి: రేపు సంగారెడ్డిలో సిఐటియు జిల్లా మహాసభ, మీడియాతో వివరాలు వెల్లడించిన జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు
సీఐటీయూ జిల్లా మహాసభ ఆదివారం సదాశివపేట పట్టణంలోని ఎన్ గార్డెన్ లో నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు తెలిపారు. సదాశివపేటలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని కార్మికుల సమస్యలపై ఈ మహాసభలో చర్చించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర అధ్యక్షులు ఛుక్కా రాములు ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు