ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో గురువారం చెడు నడతల ప్రవర్తనలో కలిగిన వ్యక్తులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. సమాజంలో ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ వారిపై దాడులకు పాల్పడుతూ ఫిర్యాదుతో కేసులు నమోదైన వారిని రౌడీ షీటర్లుగా పరిగణించబడుతుందని అటువంటి వారిపై నిరంతరం నిఘా ఉంచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రవర్తన మార్చుకోకపోతే చెడు నడతల ప్రవర్తన కలిగిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.