కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని పెండ్లిమర్రి మండలం వెల్లటూరులోని ఒక హోటల్ వద్ద మంగళవారం సీఎం పర్యటన బందోబస్తు విధులకు వచ్చిన పోలీసులు గొడవ పడినట్లు స్థానికులు తెలిపారు. రేపు 19వ తేదీన పెండ్లిమర్రి మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో బందోబస్తు విధులకు వచ్చిన పోలీసుల్లో ఒక ఏఎస్ఐ, కానిస్టేబుల్ యూనిఫామ్లలోనే రోడ్డుపై గొడవకు దిగి అసభ్య పదజాలంతో దూషించుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన స్థానికులను విస్మయానికి గురిచేసింది. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసుల ప్రవర్తనపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.