రాష్ట్రవ్యాప్తంగా 2.45 లక్షల ఇళ్ళను నేడు ప్రారంభిస్తున్నామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వెల్లడి
Ongole Urban, Prakasam | Mar 30, 2026
రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు 2.45 లక్షల గృహాలు గృహ నిర్మాణ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని దామచర్ల తెలిపారు. సోమవారం ఒంగోలులో జరిగిన గృహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని భవిష్యత్తులో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ళను మంజూరు చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.