చిత్తూరు: ప్రియురాలిని చంపిన ప్రియుడు.. పరార్.! ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైన ఘటన ఇది. స్థానికుల వివరాల మేరకు.. రామసముద్రం (M) బిక్కింవారిపల్లెకు చెందిన దేవిశ్రీ (22) బెంగళూరులో BBA చదువుతోంది. అక్కడ చౌడేపల్లి (M) పెద్దకొండామరికి చెందిన గోవర్ధన్ పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఆదివారం రాత్రి ఆమెను గోవర్ధన్ హత్య చేసి పరారైనట్లు బెంగళూరు తమ్మినహళ్లి PSలో కేసు నమోదు అయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.