కారులో అక్రమంగా తరలిస్తున్న 4.05 కోట్ల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ప్రకాశ ప్రజాపతి, ప్రగ్నేష్ కీర్తిబాయి ప్రజాపతి లను అరెస్టు చేశారు. మీడియా సమావేశంలో నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్ మాట్లాడారు. వీరిపై గత ఏడాది బోయిన్పల్లి పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు అయినట్లు వెల్లడించారు. 50 లక్షల క్యాష్ ఇస్తే 10 లక్షలు కలిపి 60 లక్షలు ఆర్టిజిఎస్ చేస్తామని నమ్మించి మోసం చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో నిందితులపై ఎన్నిగా పెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ వస్తున్నట్లు గుర్తించి షామీర్పేట్ ఓ ఆర్ ఆర్ నుంచి మహబూబ్నగర్ వరకు నిందితులను చేజింగ్ చేసినట్లు వెల్లడించారు.