తాడిపత్రి మండలం పరిధిలోని ఆర్జాస్ ఫ్యాక్టరీలో మంగళవారం ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఫ్యాక్టరీ అధికారులు, సిబ్బంది కి రోడ్డు భద్రత నిబంధనలు, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారన్నారు. రకరకాల పద్ధతులను అవలంబిస్తూ అమాయకులను మోసం చేస్తున్నారన్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రోడ్డు భద్రత చాలా ముఖ్యమన్నారు.