తానిగల్లులో వేమాలమ్మ విగ్రహం ధ్వంసం బుచ్చినాయుడు కండ్రిగ మండలం తానిగల్లులోని గ్రామదేవత వేమాలమ్మ దేవాలయంలో శనివారం రాత్రి చోరీ జరిగిందని గ్రామస్థులు తెలిపారు. అమ్మవారి విగ్రహాన్ని సైతం ధ్వంసం చేశారన్నాని పోలీసులకు సమాచారం అందించారు. తరతరాలుగా పూజలు అందుకుంటున్న గ్రామదేవత ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం కావడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు విచారిస్తున్నారు.