రేణిగుంటలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన MLA బొజ్జల రేణిగుంట రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ఇళ్లు కోల్పోయిన 51 కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. MLA బొజ్జల సుధీర్ రెడ్డి మంగళవారం లబ్దిదారులకు స్వయంగా పట్టాలు అందజేశారు. 2.5 ఎకరాల విలువైన భూమిని నిర్వాసితులకు కేటాయించామని, పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని MLA అన్నారు. సీబీడీ కాలనీ సమీపంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.