కడప జిల్లా యర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామానికి సోమవారం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీ సీఎం రమేష్ ను ఓదార్చారు. సీఎం రమేష్ మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. జేసీ అస్మిత్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లారు. సీఎం రమేష్ మాతృమూర్తి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అధైర్య పడవద్దని ధైర్యంగా ఉండాలని సీఎం రమేష్ కు సూచించారు.