ప్రతి శుక్రవారం డ్రై డే పాటించడం ద్వారా దోమల పెరుగుదలను 90 శాతం వరకు తగ్గించవచ్చని రాయదుర్గం అర్బన్ వైద్యాధికారి డా. యశ్వంత్, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ నాగేంద్రప్రసాద్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని 13 వ వార్డు చంద్రబాబునాయుడు కాలనీలో పర్యటించి దోమల నివారణకు చర్యలు చేపట్టారు. ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటింటి వద్ద నిల్వ నీటి పాత్రలను పరిశీలించి, దోమల లార్వా పెరుగుదలను అరికట్టే చర్యలను ప్రజలకు చూపించారు. 7 నుండి 10 రోజుల్లో నిల్వ నీటిలోని లార్వా పెద్ద దోమగా మారి డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేస్తుందని, వారంలో కేవలం ఒక గంట సమయం పరిసరాలు పరిశుభ్రకు కేటాయించాలని కోరారు.