ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం గన్నేపల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామ బీడు పొలాల్లో రెండు ఎద్దులు పోట్లాడుకుంటుండగా గమనించిన యజమాని వాటిని విడగొట్టే ప్రయత్నం చేశాడు. ఆగ్రహించిన రెండు ఎద్దులు యజమానిపై దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో తీవ్ర గాయాలు అయిన యజమాని మహబూ (60) అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.