అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా లోని సివిలార్కులం కు చెందిన లారీ డ్రైవర్ నిత్య కుమార్ మృతి చెందాడు. గురువారం సాయంత్రం కనగానపల్లి మండల కేంద్రంలోని హైవేపై టైర్ మారుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతనిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.