జిల్లా దోర్నాల మండలం పెద్దమంతనాలలో ఆర్తి అంకన్నను ఆర్తి నాగన్న కత్తితో పొడిచి చంపిన ఘటనలో నిందితున్ని అరెస్ట్ చేసినట్లు సీఐ అజయ్ కుమార్ తెలిపారు. అంకన్న పనికి వెళ్లి వచ్చేసరికి తన భార్య మద్యం సేవించి ఉంది. మద్యం ఎవరు పోసారని అతడు భార్యని అడిగాడు. ఆమె నాగన్న పేరు చెప్పింది దీంతో అంకన్న నాగన్నకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో అంకన్న చనిపోయినట్లు సిఐ తెలిపారు. సంబంధిత ముద్దాయి నాగన్నను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.