నంద్యాల జిల్లా రుద్రవరం మండలం నల్లవాగుపల్లి గ్రామానికి చెందిన వెంకటసుబ్బమ్మ అనే వృద్ధురాలు శుక్రవారం ఇంటి వద్ద పనులు చేస్తుండగా కోతులు దాడి చేసి తీవ్రంగా గాయ పరిచాయి,దీనితో ఆమె తలపై తీవ్ర గాయమైంది. గ్రామస్తులు వెంటనే చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామపంచాయతీ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని కోతుల బెడద నుండి అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.