ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీణ ప్రభావంతో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మల్కాపురం విఠలాపురం గ్రామాలలో పంట పొలాలను పరిశీలించారు. పంట కోతకు వచ్చిన పంటలను లోతట్టు పొలాలను పరిశీలించి రైతులకు పలు మెలకువలను తెలియజేశారు. వరి మొక్కజొన్న కోతాలను వాయిదా వేసుకోవాలని తెలిపారు.