రాయలచెరువు బాధితులకు పునరావాసం కల్పించాలి: CPM కేవీబీపురం (M) ఓలూరు పెద్ద రాయలచెరువుకు గండిపడి కళత్తూరు, పాతపాలెం, ఎస్ఎల్ పురం గ్రామస్థులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ముంపు బాధిత కుటుంబాలను ఆదుకుని వారికి పునరావాసం కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ను కలసి సమస్యలను విన్నవించారు. బాధితులకు NSS విద్యార్థులు సహకరిస్తున్నట్లు కలెక్టర్ అన్నారని ఆయన తెలిపారు.