కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల స్మరకోత్సవాల సందర్భంగా సైకిల్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈసీఐఎల్ ఎక్స్ రోడ్డు నుంచి విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏసిపి వెంకట్ రెడ్డి, ఎస్ హెచ్ ఓ భాస్కర్ రెడ్డి, పోలీసు సిబ్బంది సమన్వయంతో ర్యాలీ విజయవంతమైంది.