జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 12న జరిగిన యువతీ నిహారిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. దూరపు బంధువు శివ మాధవరెడ్డి ఆమెను గొంతు నిలిమి హత్య చేసినట్లు విచారణలో తేలింది. స్నానం చేస్తూ మృతి చెందినట్లుగా క్రియేట్ చేసిన నిందితుడిని పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు అరెస్టు చేసి నాలుగు తులాల బంగారం, 2500 నగదు, ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి సురేష్ కుమార్ తెలిపారు.