కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సింగం శివ మోహన్ రెడ్డి సోమవారం తమ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు చనిపోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అన్నారు. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.