అనంతపురం జిల్లా చాపిరి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
Anantapur Urban, Anantapur | Oct 22, 2025
అనంతపురం జిల్లా చాపిరి గ్రామం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఉరవకొండకు చెందిన హనుమంతు అనే వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. తీవ్ర గాయాల పాలైన అతనిని బుధవారం మధ్యాహ్నం అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.