నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పడకండ్ల గ్రామ సమీపంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో అదనపు సౌకర్యాలను కల్పించేందుకు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు, సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పాఠశాలలో ఐదవ తరగతి ఇంటర్ వరకు సుమారు 600 మంది బాలికలువిద్యనభ్యసిస్తున్నారని ఆమె తెలిపారు. సోమవారం తాము పాఠశాలను తనిఖీ చేసి ఇక్కడి సమస్యలు తెలుసుకోవడం జరిగిందని తెలిపారు,దాదాపు పిల్లలందరూ పాజిటివ్ గా ఏ సమస్యలు లేవని తమ దృష్టికి తీసుకొని రావడం జరిగిందని అన్నారు. స్కూల్ ఆవరణలో చెట్లు చెదారం ఎక్కువగా పెరిగిపోవడంతో పాముల బెడద ఉన్నట్లు పిల్లలు తెలపడ