కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని యోగి వేమన యూనివర్సిటీ సరికొత్త ప్రయోగం చేపట్టింది. యోగి వేమన యూనివర్సిటీ జంతుశాస్త్ర శాఖ ప్రయోగశాలలో క్యాపిటేటివ్ బ్రీడింగ్ ద్వారా సీతాకోక చిలుకలను ఉత్పత్తి చేసింది. వీటిని గురువారం వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాబ్ ద్వారా సీతాకోక చిలుకలను సృష్టించడం గొప్ప విషయమని కొనియాడారు. జువాలజి ఎచ్ఓడి డా. వెంకటరమణను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ ప్రొ. పద్మ, డీన్ ప్రొ. దాము పాల్గొన్నారు.