రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి
Anantapur Urban, Anantapur | Nov 12, 2025
అనంతపురం నగర శివారులోని జాతీయ రహదారిపై రాప్తాడు సమీపంలో ఈ నెల ఏడవ తేదీన రాత్రి సమయంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు అనే వ్యక్తి నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.