తాడిపత్రి పట్టణంలో బుధవారం జైశ్రీరామ్ భక్తమండలి ఆధ్వర్యంలో శ్రీ రంగనాథ స్వామి, గోదాదేవి కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయంలో శ్రీ రంగనాథ స్వామి, గోదాదేవి కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం చేశారు. అన్నదానం చేశారు. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.