కడప జిల్లా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే మరియు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి శనివారం పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తో సమావేశం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలోని నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప జిల్లా రాజకీయాల గురించి చర్చించి ఏ విధముగా పార్టీ ముందుకు తీసుకుని పోవాలనే అంశాలను చర్చించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.