అనంతపురం నగరంలోని జాకీర్ కొట్టాలలో ప్రమాదవశాత్తు రేకుల షెడ్డు పైనుంచి కింద పడడంతో అనంతపురం నగరంలోని ఏ నారాయణపురం కు చెందిన రామాంజనేయులు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.