నరసన్నపేట: శ్రీముఖి లింగేశ్వర స్వామి సన్నిధిలో యమేశ్వర స్వామిని తాకిన సూర్యకిరణాలు
జలుమూరు మండలం లోని శ్రీముఖలింగేశ్వరస్వామి సన్నిధిలో శుద్ధ పౌర్ణమి పర్వదినం సందర్భంగా.. బుధవారం సాయంత్రం యమేశ్వర స్వామిని సూర్యకిరణాలు తాకాయి. ఆ సమయంలో స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు ఆ దృశ్యాన్ని తిలకించి ఆనందించారు. ఈ సందర్భంగా స్వామికి అర్చకుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.