పీలేరు మండలం దొడ్డిపల్లి గ్రామపంచాయతీ సర్వే నెంబర్ 1414లో గల 2 ఎకరాల ప్రభుత్వ గయాలు భూమిని అంబేడ్కర్ భవన్ కొరకు కేటాయించాలని పీలేరు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పీలేరు రెవిన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శివకుమార్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ బాబుకు ప్రజా సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా పీలేరు మండలం నందు కొన్ని సం.లుగా అంబేడ్కర్ భవనం కొరకు ప్రజా ప్రతినిధులకు,జిల్లా,మండల,స్థాయి అధికారులకు పలుమార్లు ప్రజాసంఘాల నాయకులు వినతి పత్రాలు సమర్పించిన అటు ప్రభుత్వం గాని,ప్రజా ప్రతినిధులు గాని స్పందించికపోవడం బాధాకరమన్నారు