ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని రైతు సేవా కేంద్రం నందు గ్రామసభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి ఇన్చార్జి గూడూరు ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. నూతన ఒరవడికలతో టెక్నాలజీని కూటమి ప్రభుత్వం రైతులకు పరిచయం చేసి అధిక లాభాలను అర్జించుటకు సహాయపడుతుందన్నారు.