రాజవొమ్మంగి: మండలంలోని దూసరిపాము లో మహిళ మెడలో పుస్తెల తాడును ఎత్తుకెళ్లిన దొంగ
నిద్రిస్తున్న మహిళ మెడలో పుస్తెలతాడును దొంగ ఎత్తుకెళ్లిన ఘటన రాజవొమ్మంగిలో బుధవారం రాత్రి జరిగింది. బాధితురాలు గురువారం తెలిపిన వివరాలు మేరకు మండలంలోని దూసారపాములో ఇంటి బయట నిద్రిస్తున్న అచ్చయ్యమ్మ మెడలో ధరించిన 4 కాసుల పుస్తెలతాడును ఓ దుండగడు లాక్కెళ్లాడు. ఈ క్రమంలో మహిళ అప్రమత్తమై దొంగ బాబోయ్ అంటూ కేకలు వేసినా అప్పటికే ఆ దుండగుడు పారిపోయాడు. రూ. 3లక్షలు విలువైన బంగారు ఆభరణం పోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.