నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు సోమవారం భక్తిశ్రద్ధలతో ఇరుముడి కట్టుకున్నారు, అనంతరం కొండ మాయ పల్లె నుంచి వాసాపురం వరకు గోవింద నామ స్మరణతో పాదయాత్రగా వెళ్లారు, 21 రోజులు దీక్షలు ఉన్న అర్చకులు కమిటీ సభ్యులు సహా 15 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, రేపు మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో మాల విరమణ చేయనున్నారు