రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జిల్లా విద్యాశాఖ అధికారుల బదిలీల్లో భాగంగా చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమితులైన రాజేంద్రప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక విద్యా వ్యవస్థల బలోపేతం కోసం జిల్లా కలెక్టర్ ఇచ్చిన సూచనలు అమలు చేస్తామని ఉద్యోగులు ఉపాధ్యాయుల సమన్వయంతో మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేస్తానని చెప్పారు.