కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గండి మైసమ్మ లోని తెలంగాణ భవన్ లో ఈనెల 29 వ తేదీన నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమ విజయవంతం పై బుధవారం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు అధ్యక్షతన సనహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మరి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, పార్లమెంట్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. వీరు నాయకులు, కార్యకర్తలకు దీక్ష దివాస్ కార్యక్రమాన్ని నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు.