లారీని ఓవర్ టేక్ చేయబోయి బారికేడ్ ను ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
- పెళ్లకూరు మండలం కొత్తూరు సమీపంలో ప్రమాదం
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాయుడుపేట - పూతలపట్టు ఎన్ హెచ్-71 రహదారిపై కాకినాడ - బెంగళూరు ఎక్స్ప్రెస్ లైన్ ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న లారీని ఓవర్ టెక్ చేయబోయి రోడ్డు మార్జిన్ లోని బార్కెట్ను ఢీ కొట్టింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. ఈ బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు 35 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న పెళ్లకూరు పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికుల