అనంతపురం జిల్లా తాడపత్రి మండలంలోని ఎర్రగుంట్ల పల్లి గ్రామానికి చెందిన గంగాధర్ అనే రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పవర్ గ్రిడ్ ద్వారా తన వ్యవసాయ పొలంలో వేసిన టవర్ కారణంగా తనకు తీవ్ర నష్టం వాటిల్లేల వ్యవహరిస్తున్నారంటూ మనస్థాపం చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమించడంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అతనిని తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి చాలా విషమంగా ఉందన్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.