కొండపి: పొన్నలూరు మండలంలో స్నేహితుల మధ్య గొడవ, కత్తులతో దాడి, ఒకరికి తీవ్ర గాయాలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం, చవటపాలెంలో ధనుంజయ్, హరిబాబు అనే ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగింది. గొడవలో హరిబాబుపై ధనుంజయ్ కత్తితో దాడి చేయగా హరిబాబుకి రక్తస్రావం అయ్యింది. దీంతో పక్కనున్న స్నేహితులు భయపడి హరిబాబుని కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పొన్నలూరు పోలీసులు దనుంజయ్ ని అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు.