ప్రకాష్ జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న వారిని గుర్తించి పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు జరీమాన విధించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా బుధవారం బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.